బర్త్ డే పార్టీకి పిలిచి 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. నమ్మించి మోసం చేసిన బాయ్ ఫ్రెండ్

by సూర్య | Mon, Jun 07, 2021, 03:43 PM

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మాయ మాటలు చెప్పి దారుణాలకు ఒడిగడుతున్నారు. ముంబైలో దారుణం జరిగింది. బాయ్ ఫ్రెండ్ ని నమ్మి బర్త్​డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.  ప్రియుడి జన్మదిన వేడుకలకు వెళ్లిన 16ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్​ చేశామన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


నార్త్​ ముంబైలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్​డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM