by సూర్య | Mon, Jun 07, 2021, 03:16 PM
మానవత్వం మంటకలిసింది. కన్నబిడ్డ కాలం చేస్తే జన్మ ఇచ్చిన తండ్రి దూరం నుంచి చూసి తనకు సంబంధం లేదని వెళ్లిపోయాడు. దీంతో భార్యే భర్త మృత దేహానికి దహన సంస్కారాలు చేసింది. కృష్ణా జిల్లా, మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాచవరం రెండో డివిజన్లో ప్రసాద్, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. 15 రోజుల క్రితం ప్రసాద్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ప్రసాద్ తండ్రికి సమాచారం ఇచ్చారు. వచ్చిన ఆయన కుమారుడి మృత దేహాన్ని దూరం నుంచి చూసి వెళ్లిపోయాడు. తనకు సంబంధం లేదని కర్మకాండ చేయకుండా వెళ్లిపోయాడు.
ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఆయన తండ్రి ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో మృతుడి భార్య నిస్సహాయురాలుగా మిగిలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని ప్రసాద్ అంతిమ సంస్కారానికి కావలసిన మొత్తాన్ని పంపించారు. దీంతో ప్రసాద్ భార్యే భర్త మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించింది.
Latest News