వైసీపీ ఎమ్మెల్యేపై ఒకేసారి 10 కేసులను ఎత్తివేత.!

by సూర్య | Sat, May 29, 2021, 01:59 PM

ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న 10 కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. అందులో ఈ 10 కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉండగా.. వాటన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మార్చి 23న డీజీపీ సవాంగ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. కాగా సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని ఉదయభాను అక్రమంగా నిర్బంధించారని, వారిని కిడ్నాప్ చేసి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదులపై జగ్గయ్యపేట పీఎస్‌లో కేసు నమోదైంది. మరోవైపు జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. వీటిని  ప్రభుత్వం ఎత్తివేసింది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM