by సూర్య | Thu, May 27, 2021, 01:39 PM
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ " ఎస్ఎస్సీ " టెక్ 57 మెన్, టెక్ 28 ఉమెన్ నియామకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైనవారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ " ఓటీఏ " చెన్నైలో శిక్షణ ఇస్తారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 23 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తంఖాళీలు: 189
ఇందులో టెక్-57 మెన్ 175, టెక్-28 ఉమెన్ 14 ఉన్నాయి.
అర్హత: ఇంజినీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 20 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
Latest News