by సూర్య | Thu, May 27, 2021, 12:16 PM
వజ్రాల ప్రేమికుల మనసు మరోసారి దోచుకుంది పర్పుల్-పింక్ డైమండ్. 'సాకురా'ను వేలం వేసినవారే ఆశ్చర్య పోయారు. ఆ స్థాయిలో అది ధరను పలికింది. చరిత్రలో మొదటి సారి ఈ స్థాయిలో భారీ ధర పలకడం. వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. వేలం పాటలో వజ్రాలకు అత్యధిక డిమాండ్ రావడం మనం ఇంత వరకు చూస్తున్నాం. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ 'ది సాకురా'ను హాంగ్కాంగ్లో ఓ జూవలరీ సంస్థ అమ్మకానికి పెట్టింది. సాకురా అంటే “వికసించే చెర్రీ” అని జపనీస్ పదం. అంతే కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లో ఎక్కింది. వేలం వేయగా రూ. 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే పేరు మాత్రం ప్రకటించలేదు. 'ది సాకురా'తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు 'ది స్వీట్ హార్ట్' పేరుతో వేలం వేశారు. కాగా 'ది సాకురా' పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది.
Latest News