by సూర్య | Thu, May 27, 2021, 09:45 AM
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. పోలీసుల తనిఖీలలో భాగంగా 1,920 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం శివారులో విశాఖ ఏజెన్సీ నుంచి కూరగాయల మూటల మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Latest News