ధోనీకి రూ.12 లక్షల జరిమానా

by సూర్య | Mon, Apr 12, 2021, 04:26 PM

శనివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలై ఒత్తిడిలో ఉన్న CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ధోనీ చేసిన తొలి తప్పుగా దీనిని పరిగణించి ఆయనపై కేవలం జరిమానా వేసి వదిలేశారు. నిన్నటి మ్యాచ్‌లో ధోనీ డకౌటయ్యాడు. ధోనీ 2015లో ఐపీఎల్‌లో చెన్నై టీమ్ తరఫున ఆడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ధోనీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ టీమ్‌ సునాయాసంగా ఛేదించింది.

Latest News

 
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM