by సూర్య | Mon, Apr 12, 2021, 10:44 AM
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. మరో 904 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.35 కోట్లకు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది. గత 24 గంటల్లో 75,086 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,01,009 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Latest News