by సూర్య | Mon, Apr 12, 2021, 08:57 AM
బీహార్ లోని నలందాలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనకు కాబోయే భార్యను కలుద్దామని పిలిచి గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని గడ్డికుప్పలో దాచిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నూర్పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే వ్యక్తితో 19 ఏళ్ల ఖుష్బూకు పెద్దలు వివాహం నిశ్చయించారు. వారికి జూన్ 20 న వివాహం జరగాల్సి ఉంది. కానీ ఆ యువకుడు యువతిని హతమార్చడం సంచలనంగా మారింది. యువతి హత్య వార్త తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుమార్తె.. అతడి కంటే ఎక్కువ ఎత్తు ఉందని అతడి ఫ్రెండ్స్ అన్నారని, అందుకే అతడు తన కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Latest News