ధోనీ సేనపై దిల్లీ గెలుపు.. పృథ్వీ ని ఆటపట్టించిన ధావన్

by సూర్య | Sun, Apr 11, 2021, 01:13 PM

ధోనీ సేనపై సాధికార గెలుపుతో దిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆనందం నెలకొంది. అర్ధసెంచరీలతో కదం తొక్కిన ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు మ్యాచ్‌ అనంతరం ఉల్లాసంగా డ్యాన్సులు చేస్తూ వీడియో షేర్‌ చేశారు. బ్యాట్‌ పట్టుకుని మరో మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్నట్టు కనిపించిన షాను చూసి ధావన్‌ ఆటపట్టించాడు. ఓ పాట పాడుకుంటూ వచ్చి ఏకంగా రెండు చేతులతో షాను పైకెత్తుకుని నవ్వించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో షా 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా 10 బౌండరీలు, రెండు సిక్సర్లతో 85 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇద్దరూ విరుచుకుపడటంతో దిల్లీ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే సునాయాస విజయం సాధించింది.

Latest News

 
చేనేతలకి బీజేపీ ఆ మాట చెప్పగలదా ? Tue, May 07, 2024, 07:13 PM
హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Tue, May 07, 2024, 07:12 PM
ఎవ‌రు మీకు మంచి చేశారో ఆలోచించి ఓటు వెయ్యండి Tue, May 07, 2024, 07:12 PM
కాపు కార్పొరేషన్ ను చంద్రబాబు ఓ ప్రహాసనంగా మార్చారు Tue, May 07, 2024, 07:11 PM
చంద్రబాబుకి అనుకూలంగా ఈసీ పని చేస్తోంది Tue, May 07, 2024, 07:10 PM