by సూర్య | Sat, Apr 10, 2021, 08:53 AM
కన్యత్వ పరీక్షల్లో విఫలమయ్యారని అక్కాచెల్లెళ్లకు వారి భర్తల నుండి విడాకులు ఇప్పించారు కుల పెద్దలు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగింది. కంజర్భట్ తెగకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గతేడాది నవంబర్ లో బెల్గాంలోని ఇద్దరు అబ్బాయిలతో వివాహం జరిగింది. కంజర్భట్ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన వెంటనే కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకామె విఫలమైంది. దీంతో భర్త, అత్తింటి వారు ఆమెను వేధించడం ప్రారంభించారు. ఫిబ్రవరిలో కుల పెద్దల సమక్షంలో మరో సారి పంచాయతీ నిర్వహించారు. ఇందులో ఇద్దరి అక్కాచెల్లెళ్లకు వారి భర్తల నుండి విడాకులు కల్పిస్తూ కులపెద్దలు తీర్పు ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై రాజారామ్ పురి పోలీసులను ఆశ్రయించారు ఆ అక్కాచెల్లెళ్లు.
Latest News