by సూర్య | Fri, Apr 09, 2021, 08:41 AM
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాగా, గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఆయనకు పరీక్షలు చేయించగా పాజిటివ్గా తేలిందని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. దీంతో 77 ఏండ్ల చాందీని తిరువనంతపురంలోని దవాఖానకు తరలించే అవకాశం ఉన్నది. ఊమెన్ చాందీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఆకాంక్షించారు.
Latest News