by సూర్య | Fri, Apr 09, 2021, 08:45 AM
అనుమానాస్పదస్థితిలో గిరిజన యువతి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. విజయనగరం కురుపాం మండలం నేరేడుమాను గ్రామానికి చెందిన బిడ్డిక జ్యోతి (18) తన స్నేహితురాలి వివాహానికి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం బిల్లుగూడకు వెళ్లింది. ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి నీలకంఠపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు భద్రగిరి ఆసుపత్రికి రిఫర్ చేయడంతో ఆసుపత్రికి చేరేలోపు యువతి మఅతి చెందింది. భద్రగిరి ఆసుపత్రి వద్ద యువతి మృతదేహాన్ని ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Latest News