by సూర్య | Tue, Apr 06, 2021, 04:04 PM
ఓ వరుడు వధువును రూ.3లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. రెండు వారాల పాటు కాపురం చేసిన ఆ వధువు.. ఆ తర్వాత పరారయ్యింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో జరిగింది. భరత్ పూర్ జిల్లా నాగ్లామాదర్ గ్రామానికి చెందిన నారాయణ్ సింగ్ గుర్జర్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన సునీత అనే యువతి తండ్రికి రూ.3లక్షలు చెల్లించి.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత రెండు వారాల తర్వాత సునీతను ఇంట్లో ఒంటరిగా వదిలేసి భర్త నారాయణ్ సింగ్ పనిమీద బయటకు వెళ్లాడు.
అతడు తిరిగి వచ్చేటప్పటికీ భార్య సునీత ఇంట్లో లేదు. తాను రూ.3లక్షలకు ఆమెను కొని పెళ్లి చేసుకున్నానని, ఆమె ఇంటి నుంచి పారిపోయిందని భర్త నారాయణ్ సింగ్ అత్తింటివారికి చెప్పాడు. సునీత తండ్రి, సోదరుడు ఆమె గురించి తమకు తెలియదని చెప్పడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన భార్యపై భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News