by సూర్య | Tue, Apr 06, 2021, 12:53 PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపుతామని వచ్చిన ఓ బెదిరింపు మెయిల్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వారిని హతమార్చుతామని మంగళవారం ఉదయం ముంబైలోని సీఆర్పీఎఫ్ కు ఓ ఈమెయిల్ వచ్చింది. అమిత్ షా, మోగి ఆదిత్యానాథ్ తో పాటు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఎటాక్ చేస్తామని హెచ్చరించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 సూసైడ్ బాంబర్ల ద్వారా ఈ దాడులు చేయబోతున్నామని రాసినట్లు చెప్పారు. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Latest News