by సూర్య | Mon, Apr 05, 2021, 10:25 AM
చిత్తూరు బైరెడ్డిపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా.. జల్లికట్టుపై కోర్టు నిషేధం విధించింది. దీంతో చిత్తూరులో జరుగుతున్న జల్లికట్టుకు తమిళనాడు వాసులు భారీగా చేరుకున్నారు. జనాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజలను కంట్రోల్ చేస్తున్న క్రమంలో ఓ ఎద్దు పోలీసులపైకి దూసుకువచ్చింది. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ను దాని కొమ్ములతో కుమ్మింది. దీంతో ఆ కానిస్టేబుల్ అమాంతం గాలిలోకి ఎగిరిపడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Latest News