ఈ నెల 4వ తేదీన రాష్ట్ర స్థాయి క్యాటరర్స్ సమావేశం

by సూర్య | Sat, Apr 03, 2021, 12:39 PM

కేటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీ నగర్ ఫిలింఛాంబర్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ బందర్ రోడ్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ నందు 13జిల్లాల నుండి విచ్చేసిన క్యాటరర్స్ తో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యముగా క్యాటరింగ్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని , జీఎస్టీ , ఫుడ్ సేఫ్టీ వంటి వాటి తోపాటు అనేక సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించి అసోసియేషన్ సభ్యులందరికీ అవగాహన కల్పించబడుతుందన్నారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని , హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, ఎండోమెంట్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అంబికాదర్బార్ బత్తి యండి అంబికా కృష్ణ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యారెక్టర్స్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని, తెనాలి డబుల్ హార్స్ మినప గుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ హాజరు కానున్నట్లు పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు.


ఈ సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అద్దేపల్లి వి ఎస్ రవికుమార్, ట్రెజరర్ జొన్నలగడ్డ రమేష్ బాబు , జనరల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ విజయ్ కౌల్వార్ , ఉపాధ్యక్షులు వి తేజ సుబ్రహ్మణ్యం వై బాలగంగాధర్ తిలక్ , జె ఉమామహేశ్వరరావు , టీ నాగేశ్వరరావు జాయింట్ సెక్రెటరీ లు బి కిరణ్ జి శ్రీనివాసరావు, కే కోటేశ్వరరావు, పి బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM