ఒడిశాలో 350 కిలోల గంజాయి స్వాధీనం

by సూర్య | Sat, Apr 03, 2021, 08:37 AM

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ‌ర‌త్ కుమార్ నాయ‌క్(45) అనే వ్య‌క్తి ఇంట్లో భారీ మొత్తంలో గంజాయి నిల్వ చేసిన‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా సమాచారం అందింది. దీంతో మ‌యూర్‌భంజ్ ఎస్పీ స్మిత్ ప‌ర్మార్, ఐజీ దిప్తేష్ ప‌ట్నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేసి త‌నిఖీలు నిర్వ‌హించారు.


నాయ‌క్ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు 100 గంజాయిని ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో ఇంట్లో 16 గోనె సంచుల్లో నిల్వ ఉంచిన 350 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. గంజాయితో పాటు రూ. 5,91,000ల న‌గ‌దు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు కార్లు, ప‌లు బ్యాంకుల‌కు చెందిన ఏటీఎం కార్డులు, పాస్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మ‌గ్ల‌ర్ నాయ‌క్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News

 
పెనగలూరు మండలంలో టీడీపీ లోకి భారీగా చేరికలు Tue, May 07, 2024, 05:16 PM
పీపుల్స్ మ్యాని ఫెస్టో బుక్ లెట్ ను ఆవిష్కరించిన జెవివి Tue, May 07, 2024, 05:15 PM
చిట్వేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ నాయకులు Tue, May 07, 2024, 05:13 PM
మరొకసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Tue, May 07, 2024, 05:12 PM
నిత్యం ప్రజల కోసమే పని చేస్తా- ఉగ్ర నరసింహ రెడ్డి Tue, May 07, 2024, 05:09 PM