by సూర్య | Tue, Mar 30, 2021, 05:46 PM
ఐపీఎల్ 2021కు అభిమానులు రెడీ అయిపోతున్నారు. తమ ఫ్యాన్స్ ను అలరించేందుకు ఫ్రాంఛైజీలు సైతం సరికొత్త ప్లాన్లతో రాబోతున్నాయి. అయితే పంజాబ్ సరికొత్త మార్పులతో రాబోయే సీజన్కు సన్నద్ధమవుతోంది. ఈ సారి కొత్త జెర్సీతో రంగంలోకి దిగబోతోంది పంజాబ్ టీమ్. గోల్డెన్ స్ట్రిప్లతో రెడ్ జెర్సీని రూపొందించారు. అయితే పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. రోరింగ్ లయన్ గోల్డెన్ షీల్డ్తో ఉన్న పంజాబ్ జెర్సీ గతంలో ఆర్సీబీ వాడిన జెర్సీని గుర్తుకు తెస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆర్సీబీని పోలిన జెర్సీ వాడటం పై పంజాబ్ టీమ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆర్సీబీని వెంటాడిన దురదృష్టం తమ జట్టును వెంటాడుతుందా అని టెన్షన్ పడుతున్నారు.
Latest News