రైలు ప్రయాణికులకు శుభవార్త..

by సూర్య | Tue, Mar 30, 2021, 05:42 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వాస్తవానికి ఈ రైళ్లు మార్చి నెలాఖరు వరకే గతంలో ప్రకటించింది. వీటిని మరి కొన్ని నెలలు పొడిగించింది. రైలు నెంబర్ 02831 విశాఖపట్నం నుంచి లింగపల్లి ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 02832 లింగపల్లి నుంచి విశాఖపట్నం ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 07488 విశాఖపట్నం నుంచి కడపకు ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 07487 కడప నుంచి విశాఖపట్నం ప్రతీ రోజు వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 02845 భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్రతీ ఆదివారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 02868 పుదుచ్చెరి నుంచి హౌరా ప్రతీ బుధవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు సేవలు అందిస్తుంది. రైలు నెంబర్ 02878 ఎర్నాకుళం నుంచి హౌరా ప్రతీ సోమవారం వెళ్తుంది. ఈ రైలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 26 వరకు సేవలు అందిస్తుంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM