by సూర్య | Tue, Mar 30, 2021, 03:49 PM
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ లో కొన్ని కొత్త రూల్స్ ఉండనున్నాయి. సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఉండదని బోర్డు తెలిపింది.
-> ఇక ఈ సీజన్ లో 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ 20వ ఓవర్ పూర్తి కావాలి. గతంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ సమయాన్ని తగ్గించేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ కచ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్) ముగియాలి. అంటే గంటకు 14.11 ఓవర్లు వేయాలి.
-> ఓ బ్యాట్స్మన్ పరుగు తీసే క్రమంలో బ్యాట్ ను క్రీజులో సరిగా ఉంచకపోతే షార్ట్ రన్ గా అంపైర్లు ప్రకటిస్తారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ కు వదిలేశారు. ఒకవేళ ఆన్ ఫీల్డ్ అంపైర్ పొరపాటున షార్ట్ రన్ ప్రకటిస్తే దానిని ఓవర్ రూల్ చేసే అవకాశం థర్డ్ అంపైర్ కు ఉంటుంది.
Latest News