by సూర్య | Tue, Mar 30, 2021, 04:13 PM
తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో బహిర్గతమైంది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఆర్బిఐ వెల్లడించిన ప్రకారం.. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల వరకు ఎపి రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను తీసుకున్నాయి. అప్పులను తీసుకోవడంలో ఎపి కంటే ముందు వరుసలో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. మహారాష్ట్ర రూ.65,000 కోట్లు, తమిళనాడు రూ.63,000 మేర అప్పులు ఉన్నాయి.
Latest News