by సూర్య | Tue, Mar 30, 2021, 03:19 PM
ఏపీలోని తిరుపతి లోక్ సభకు జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ - బీజేపీల మధ్య ఓ పాట వివాదం రాజేసింది. సీఎం జగన్ పై “రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న” పేరుతో వైసీపీ పాటను రూపొందించింది. ప్రముఖ గాయని మంగ్లీ చేత ఈ పాటను పాడించారు. వైసీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ పాటను తప్పని సరిగా ఉపయోగిస్తూ వస్తోంది వైసీపీ.
అయితే “భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ” పేరుతో అదే ట్యూన్ పాటను రూపొందించారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ సమయంలోనూ ఇదే పాటను ఉపయోగించగా వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తమ పాటనే కాదు తమ కార్యక్రమాలు సైతం కాపీ కొడతారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
Latest News