by సూర్య | Sat, Mar 27, 2021, 02:30 PM
తాజాగా విడుదలైన జాతీయ మహిళా కమిషన్ నివేదిక భయానక నిజాలు వెలువరించింది. గతేడాది లాక్ డౌన్ పీరియడ్ లో మహిళలపై గృహ హింస పెరిగిపోయిందని ఎన్సీడబ్ల్యూ వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించి 2019లో మొత్తం 19,730 ఫిర్యాదులు రాగా, 2020లో 23,722 ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థికంగా అభద్రతాభావం, ఒత్తిడి పెరగడం, ఆర్థికపరమైన ఆందోళన వంటి అంశాలు ఈ హింసకు కారణం అయి ఉంటాయని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. కాగా లాక్ డౌన్ సమయంలో ఫిర్యాదులు పెరగడంతో ఎన్సీడబ్ల్యూ ఓ వాట్సాప్ నంబర్ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Latest News