అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత

by సూర్య | Sun, Mar 28, 2021, 08:50 AM

 ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను కడపలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో ఎముకల డాక్టర్‌గా పనిచేసిన వెంకట సుబ్బయ్య.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.


 


 

Latest News

 
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM
వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తా Tue, Apr 23, 2024, 08:07 PM
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? Tue, Apr 23, 2024, 08:07 PM