by సూర్య | Sat, Mar 27, 2021, 02:26 PM
ఇండియాలో ఒక్క రోజులో యాక్టివ్ కేసుల సంఖ్య 31,581 పెరిగింది. ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ తప్ప... మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరిగాయి. ఇండియాలో కొత్తగా 62,258 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. కొత్తగా 291 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,61,240 అయ్యింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 30,386 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,12,95,023కి చేరింది. రికవరీ రేటు 94.8 శాతంగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం 4,52,647 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్తగా 11,64,915 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 23,97,69,553కి చేరింది.
Latest News