by సూర్య | Thu, Mar 25, 2021, 01:07 PM
పంజాబ్ కి చెందిన ఓ తుక్కు వ్యాపారి కుటుంబం ఇప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. దీనికి కారణం వారికి కోటి రూపాయల లాటరీ తగలడమే. పంజాబ్ లోని భాగాపురానాకి చెందిన ఆశా రాణి ఓ గృహిణి. ఆమె భర్త తుక్కు (స్క్రాప్) వ్యాపారం చేస్తుంటారు. ఆమె ఇద్దరు కుమారులు కూడా తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఆశా రాణి పంజాబ్ స్టేట్ డీర్ 100 మంత్లీ లాటరీ టికెట్ ని కొంది. అయితే కొనడమైతే కొన్నది కానీ తనకు కోటి రూపాయల లాటరీ వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదట. కానీ అదే నిజమైంది. ఆమె లాటరీ విన్నర్ గా నిలిచింది. ఇంత డబ్బు ఒక్కసారిగా తనకు వస్తుందని కలలో కూడా భావించలేదని చెప్పిన ఆశా రాణి తమ కలలన్నీ నెరవేర్చుకోవడానికి ఈ మార్గాన్ని చూపిందంటోంది. ఈ వచ్చిన డబ్బుతో ముందు ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నానని ఆమె వెల్లడించింది.
Latest News