by సూర్య | Thu, Mar 25, 2021, 01:26 PM
కర్నూల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇది కర్నూల్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుతు పనులు పూర్తి కాకున్నా నాటి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ రిబన్ కట్ చేశారని విమర్శించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని సీఎం తెలిపారు. కాగా విమాన సంస్థ ఇండిగో ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది.
Latest News