by సూర్య | Thu, Mar 25, 2021, 12:46 PM
యూట్యూబ్ లో చూసిన ట్రిక్ ఫాలో అయిన ఓ బాలుడి ప్రాణం పోయింది. కేరళలో ఈ దారుణం జరిగింది. తిరువనంతపురంలోని వెంగనూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల శివనారాయణన్ ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇతను సోషల్ మీడియాలో ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ లో చూసి సరికొత్త హెయిర్ స్టైల్ కు మారాలని భావించాడు.
ఇందుకోసం యూట్యూబ్ లో చెప్పినట్లుగా హెయిర్ పై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో ఆ బాలుడికి మంటలు అంటుకున్నాయి. గమనించిన నాన్నమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శివనారాయణన్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యూట్యూబ్ ట్రిక్ బెడిసి కొట్టడంతో 12 ఏళ్లకే శివనారాయణన్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ అన్ని గుడ్డిగా పాటిస్తే ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Latest News