by సూర్య | Tue, Mar 23, 2021, 05:45 PM
ప్రధాని నరేంద్ర మోదీ గత 21 ఏళ్లుగా ప్రజాసేవలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఇంతవరకూ తాను ఒక్క సెలవు కూడా తీసుకోలేదని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశం, ప్రజల కోసం నిరంతర సేవలు అందించాలని ఎంపీలకు ప్రధాని సూచించారు. మంగళవారంనాడు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. కోవిడ్ మహమ్మారి ఒక సవాలు అనీ, ఆ సమయంలో అత్యుత్తమంగా పనిచేసినట్టు తాను భావిస్తున్నానని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.
Latest News