ఏపీలో మరో కొత్త మున్సిపల్ కార్పొరేషన్

by సూర్య | Tue, Mar 23, 2021, 05:43 PM

ఆంధ్రప్రదేశ్ లో మరొ కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీతో దాని పరిధిలో ఉన్న 11 గ్రామాలు,తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు పట్టణ పరిధిలో ఉన్న 10 గ్రామాలు మొత్తం 21 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1994 ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.1000 కోట్లు కూడా కేటాయించింది. ఈ ఏడాది జనవరిలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM