పిడుగు పడి క్రీడాకారిణి మృతి

by సూర్య | Tue, Mar 23, 2021, 04:24 PM

ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్ 22 ఏళ్ళ కేథరిన్ డయాజ్ పిడుగుపాటుకు గురై మరణించింది. అంతర్జాతీయ సర్ఫింగ్ అసోసియేషన్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్ సాల్వడార్ లో ఈమె శిక్షణ తీసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురైంది. స్పోర్ట్స్ కి గ్లోబల్ అంబాసిడర్ గా ఉన్న కేథరిన్ పలు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లోనూ, ఐఎస్ఎ వరల్డ్ సర్ఫింగ్ గేమ్స్, ఐఎస్ఎ వరల్డ్ జూనియర్ సర్ఫింగ్ చాంపియన్ షిప్ లలోనూ పాల్గొని సత్తా చాటింది. వరల్డ్ సర్ఫ్ గేమ్స్ కోసం కేథరిన్ ప్రిపేర్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొనాలంటే ఇందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పిడుగుపాటు కారణంగా తీవ్రంగా గాయపడిన ఈమెకు బీచ్ లోనే సపర్యలు చేసి..రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అంతర్జాతీయ సర్ఫింగ్ సంస్థ విచారం వ్యక్తం చేసింది.

Latest News

 
జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు ఉండవు Sat, May 04, 2024, 05:47 PM
మా భూమి మాది కాకపోతే మరెవరిది? Sat, May 04, 2024, 05:47 PM
బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే Sat, May 04, 2024, 05:46 PM
రాజకీయ హత్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు Sat, May 04, 2024, 05:43 PM
దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే రాజ్యాంగం మార్చడం ఖాయం Sat, May 04, 2024, 05:43 PM