by సూర్య | Tue, Mar 23, 2021, 03:41 PM
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేసి జోరుమీదున్నాడు. 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగుల మార్క్ ను దాటాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(28)తో కలిసి తొలి వికెట్ కు 64 పరుగులు జోడించాడు. ప్రస్తుతం ధావన్, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం కొనసాగుతోంది. 24 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. కోహ్లీ(39), ధావన్(58) క్రీజులో ఉన్నారు.
Latest News