by సూర్య | Thu, Jan 21, 2021, 09:48 AM
హైదరాబాద్: విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావును గత రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. రాజాంలోని తన నివాసంలో గత రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేసిన నెల్లిమర్ల పోలీసులు అనంతరం చీపురుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదని అన్నారు. తాము ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని కళా వెంకటరావు నిలదీశారు.
Latest News