ఇంట్లో తెలియడంతో.. ప్రియుడితో కలిసి...

by సూర్య | Wed, Jan 20, 2021, 10:31 AM

ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, మనసులు కలవడంతో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరి ఇళ్లలో విషయం తెలియడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వివాహేతర సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందని భయపడి.. ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రియురాలు చనిపోగా ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లా యడ్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.


యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కానీషా అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ (38) అనే వ్యక్తితో సునీత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవలే ఈ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో వారిబంధం కొనసాగించేందుకు అవకాశం లేదని భావించి ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి కాకుమాను శివారుకు వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.


అయితే పురుగుల మందు తాగిన విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే సునీత మృతి చెంది ఉంది. వేణుగోపాల్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సునీత మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM