by సూర్య | Mon, Jan 18, 2021, 04:53 PM
జపాన్, దక్షిణ కొరియా ప్రజలు దేన్నైనా ఉత్తినే పారేయకూడదనుకుంటారు. ముఖ్యంగా కొరియన్లు ప్రత్యేక స్కిన్ కేర్ విధానం పాటిస్తారు. ఇందుకోసం ఎలాంటి క్రీములూ, లోషన్లనూ వాళ్లు వాడరు. బియ్యాన్ని నానబెట్టిన లేదా రైస్ని కడిగిన నీటిని వాళ్లు పారేయకుండా చక్కగా వాడేసుకుంటారు. బియ్యాన్ని నానబెట్టిన నీటిలో చర్మాన్ని కాపాడే గుణాలుంటాయని పరిశోధనల్లో తేలింది. రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధకులు. ఏం చెయ్యాలంటే బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక ఆ నీటిని వేరు చెయ్యాలి. ఆ తరవాత బియ్యాన్ని వేరే నీటితో కడుక్కోవచ్చు. వేరు చేసిన నీటిని ఫ్రిజ్లోని ఐస్ క్యూబ్ ట్రేలలో వెయ్యాలి. ఆ ట్రేలలో నీరు గడ్డకట్టి ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకోవాలి. ఐస్ ట్రేలలో వేయగా మిగిలిన నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలుంటాయి.
Latest News