బియ్యం నీటితో లాభాలివే..

by సూర్య | Mon, Jan 18, 2021, 04:53 PM

జపాన్, దక్షిణ కొరియా ప్రజలు దేన్నైనా ఉత్తినే పారేయకూడదనుకుంటారు. ముఖ్యంగా కొరియన్లు ప్రత్యేక స్కిన్ కేర్ విధానం పాటిస్తారు. ఇందుకోసం ఎలాంటి క్రీములూ, లోషన్లనూ వాళ్లు వాడరు. బియ్యాన్ని నానబెట్టిన లేదా రైస్‌ని కడిగిన నీటిని వాళ్లు పారేయకుండా చక్కగా వాడేసుకుంటారు. బియ్యాన్ని నానబెట్టిన నీటిలో చర్మాన్ని కాపాడే గుణాలుంటాయని పరిశోధనల్లో తేలింది. రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధకులు. ఏం చెయ్యాలంటే బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక ఆ నీటిని వేరు చెయ్యాలి. ఆ తరవాత బియ్యాన్ని వేరే నీటితో కడుక్కోవచ్చు. వేరు చేసిన నీటిని ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలలో వెయ్యాలి. ఆ ట్రేలలో నీరు గడ్డకట్టి ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకోవాలి. ఐస్ ట్రేలలో వేయగా మిగిలిన నీటిని ఏదైనా స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలుంటాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM