by సూర్య | Mon, Jan 18, 2021, 12:47 PM
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ప్రేమికుల ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రేమికులను సత్తెనపల్లికి చెందిన కిరణ్, ప్రదీప్తిగా గుర్తించారు. గత రాత్రి వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Latest News