వాట్సాప్ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడని దారుణం..

by సూర్య | Mon, Jan 18, 2021, 11:35 AM

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే యశ్వంతపుర ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్‌ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీను ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే హత్యకు గురైన శ్రీను దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. రాజగోపాల్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM