by సూర్య | Sun, Jan 17, 2021, 05:05 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఐపిఎల్ 14వ ఎడిషన్ మీని వేలం ఫిబ్రవరి 11న జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికి అయితే ఆ విషయంపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది. అయితే తాజా సమాచారం 2021 ఫిబ్రవరి 16 న ఆక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేలం పాల్గొనే ఆటగాళ్ళు ఫిబ్రవరి 4వ తేది లోపు ఆన్లైన్ ఆప్షన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. ఇక వేలం సంబంధించిన విషయాలను నేరుగా రాష్ట్ర సంఘాలతో మాత్రమే బీసీసీఐ చర్చించనుంది. అయితే స్టేట్ క్రికెట్ అసోషియన్ తరపున ఆడుతున్న ఆటగాళ్ళతో కానీ వారి మెనేజర్లతో కానీ వేలానికి సంబంధించిన విషయాలను పంచుకోదు. వేలంలో పాల్గొనే ఆటగాళ్ళు సంబంధిత రాష్ట్ర క్రికెట్ సంఘాల ద్వారా మాత్రమే పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇక గత నెలలో జరిగిన బిసిసిఐ వార్షిక సమావేశంలో ఐపిఎల్ 2021 సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సీజన్లలో 8 జట్లు మాత్రమే ఆడనున్నాయని 2022లో 10 జట్లను చేర్చుతున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఈసారి భారతదేశంలోనే ఐపిఎల్ నిర్వహించాలని బిసిసిఐ ఆలోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం 11 ఏప్రిల్ 2021న ఐపీఎల్ ప్రారంభం కానుంది.
Latest News