టీమిండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్..

by సూర్య | Sun, Jan 17, 2021, 01:43 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ దుమ్ములేపారు. తమ నిలకడైన బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలింగ్‌ను వణికించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తమ టెస్ట్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇకపోతే లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్‌ ఠాకుర్‌(67; 115 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో రాణించారు.
ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీమ్‌ఇండియా తరఫున ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఆధిక్యం 33గా నమోదైంది. కంగారూ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 5 వికెట్లు తీయగా, స్టార్క్‌ 2, కమిన్స్‌ 2, లైయన్‌ ఒక వికెట్‌ తీశారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM