by సూర్య | Sun, Jan 17, 2021, 01:38 PM
విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఎవరికి లాభం అన్నది అందరికీ అర్థం అవుతొందని, ఇవన్నీ దురుద్దేశాలతో రాజకీయాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కేసుల్లో మీ పాత్ర ఉందని తాము చెప్పలేదని, కొన్నింటిలో మీ పాత్ర ఉందని, తాము కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా అని ప్రశ్నించారు. అఖిలప్రియ కేసులో స్పందనే లేదని, కానీ ఈ 9 కేసులపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 9 కేసుల్లో ఉన్న వారు మీవారు కాదని గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా అని నిలదీశారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని, విగ్రహాలు పగలగొట్టొచ్చు కానీ వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేసారు. భగవంతుడితో ఆడుకున్న వారు ఎవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు.
Latest News