by సూర్య | Sun, Jan 17, 2021, 12:25 PM
ఏపీలో ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానానికి జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసర సరుకుల డోర్ డెలీవరి కోసం ఇప్పటికే సీఎం జగన్ ప్రత్యేక వాహనాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాహనాలకు సంబంధించి రుణాలు కూడా మంజూరు చేశారు. ఇకపోతే విజయవాడలోని బెంజిసర్కిల్ లో డోర్ డెలివరీ కోసం రూపొందించిన ప్రత్యేక సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను అధికారులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి డోర్ డెలివరీ విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Latest News