by సూర్య | Fri, Jan 15, 2021, 08:42 AM
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును రాహుల్ గాంధీ వీక్షించారు. సంక్రాంతి రోజున మధురై జిల్లాలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి వీక్షించారు. రాహుల్ చేయి కలిపేందుకు క్రీడాకారులు పోటీపడ్డారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ఎద్దులకు, పోటీదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు. తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు.
Latest News