by సూర్య | Fri, Jan 15, 2021, 07:54 AM
గబ్బా: టీమ్ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 57/2 స్కోర్ సాధించింది. క్రీజులో మార్నస్ లబుషేన్(16), స్టీవ్స్మిత్(25) ఉన్నారు. వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు తొలి ఓవర్లోనే టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ను పెవిలియన్ పంపాడు. ఐదో బంతికి స్లిప్లో రోహిత్ చేతికి చిక్కి వార్నర్ ఔటయ్యాడు. తర్వాత మార్కస్ హారిస్(5) శార్దుల్ ఠాకుర్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన లబుషేన్, స్మిత్ నిలకడగా ఆడుతున్నారు.
Latest News