20 ఓవర్లకు ఆస్ట్రేలియా 57/2

by సూర్య | Fri, Jan 15, 2021, 07:54 AM

గబ్బా: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 57/2 స్కోర్‌ సాధించింది. క్రీజులో మార్నస్‌ లబుషేన్‌(16), స్టీవ్‌స్మిత్‌(25) ఉన్నారు. వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు తొలి ఓవర్‌లోనే టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రమాదకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(1)ను పెవిలియన్‌ పంపాడు. ఐదో బంతికి స్లిప్‌లో రోహిత్‌ చేతికి చిక్కి వార్నర్‌ ఔటయ్యాడు. తర్వాత మార్కస్‌ హారిస్‌(5) శార్దుల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన లబుషేన్‌, స్మిత్‌ నిలకడగా ఆడుతున్నారు.

Latest News

 
సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హనిమిరెడ్డి Wed, May 01, 2024, 03:47 PM
దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం Wed, May 01, 2024, 03:42 PM
పాము కాటుకి గురైన మహిళ.. చికిత్స పొందుతూ మృతి Wed, May 01, 2024, 03:39 PM
మే డే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం జగన్ Wed, May 01, 2024, 03:32 PM
మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసింది Wed, May 01, 2024, 03:32 PM