అక్కడ ఈ నెల 18 నుంచి స్కూళ్లు రీఓపెన్..

by సూర్య | Wed, Jan 13, 2021, 03:39 PM

ఢిల్లీలో జనవరి 18వ తేదీ నుంచి స్కూళ్ల‌ను రీఓపెన్ చేయ‌నున్నారు. 10, 12 వ త‌ర‌గ‌తుల విద్యార్థులకు స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రీ బోర్డు ప్రిప‌రేష‌న్‌, ప్రాక్టిక‌ల్ వ‌ర్క్‌ ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 18వ తేదీ నుంచి విద్యార్థులు పాఠశాలలకు హాజ‌రుకావాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. స్కూళ్లకు రావాలనుకున్న పిల్లలు.. త‌ల్లితండ్రుల నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత‌నే స్కూళ్ల‌కు రావాలంటూ ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలలకు హాజ‌ర‌వుతున్న విద్యార్థుల రికార్డును మెయిన్‌టేన్ చేయాల‌ని ప్ర‌భుత్వం పాఠశాలలను ఆదేశించింది. అయితే ఆ రికార్డును మాత్రం అటెండెన్స్‌ గా వాడ‌రాదని పేర్కొంది. పాఠశాలలకు భౌతికంగా హాజ‌రు కావాల‌న్న అంశాన్ని ప్రభుత్వం విద్యార్థుల‌కే వదిలేసింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM