by సూర్య | Wed, Jan 13, 2021, 03:19 PM
రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారు. రైతుల కోసం నేను పోరాడుతుంటే మైనింగ్ మాఫియా, బెట్టింగ్, బూతుల మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల పేరు చెప్పగానే తొలుత కోహినూరు వజ్రం గుర్తుకు వస్తుందన్నారు.
Latest News