by సూర్య | Wed, Jan 13, 2021, 11:45 AM
సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు.. అంతటా గాలి పటాల సందడి మెుదలవుతుంది. దేశమంతా ఈ సంక్రాంతి పడుగను వేర్వేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పడుగకు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. గాలిపటాలకు కట్టే మాంజాతో ఏటా ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. తాజాగా మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అజ్నిలోని ధ్యానేశ్వర్ నగర్కు చెంది ప్రణయ్ ప్రకాశ్ మంగళవారం తన తండ్రితో ఇంటికి వెళ్తున్నాడు.
వేర్వేరు బైక్లపై తండ్రీ కొడుకులు ఇంటికి వెళ్తున్నారు. అయితే జట్టారోడి స్క్వేర్ దాటుతున్న సమయంలో.. ప్రణయ్ మెడకు పదునైన పతంగి దారం చుట్టుకుంది. బైక్పై వేగంగా వెళ్లడం..మాంజా పదునుగా ఉండడంతో ప్రణయ్ గొంతు తెగింది. క్షణాల్లోనే బైక్పై నుంచి అతడు కిందపడిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.