by సూర్య | Tue, Jan 12, 2021, 05:12 PM
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సుకి విద్యుత్ వైర్లు తగలడంతో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కి గురై అక్కడిక్కడే మృతిచెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రవేట్ ట్రావెల్స్ బస్సు తంజావూర్ వైపు వెళ్తుండగా తిరువైయారు వద్ద విద్యుత్ తీగలను రాసుకుంటూ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News