విషాదం.. బాలుడితో సహా దంపతుల ఆత్మహత్య

by సూర్య | Tue, Jan 12, 2021, 05:20 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు పరశురాం, సత్యవతి, ఏడాదిన్నర బాలుడిగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైమావతి అనే మహిళకు మృతులు రూ.46 లక్షలు ఇచ్చినట్లు మృతుల బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె డబ్బుతో పారిపోవడంతోనే వీరు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM