చికెన్ వడ్డించలేదని దాబాను తగలబెట్టారు

by సూర్య | Mon, Jan 11, 2021, 12:47 PM

పీకలదాకా మందుకొట్టిన మందుబాబులు రెచ్చిపోయారు. ఓ రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది.నాగపూర్ నగరంలో ఆదివారం రాత్రి శంకర్ టేడే(29), సాగర్ పటేల్ (19) లు పీకల దాకా మద్యం తాగి బెల్టరోడి ప్రాంతంలోని దాబాకు వచ్చారు. తమకు చికెన్ వడ్డించమని మందుబాబులు కోరాడు. అయితే అందుకు దాబా యజమాని నిరాకరించాడు.దీంతో కోపంతో మందుబాబులిద్దరూ దాబాకు నిప్పంటించి పారిపోయారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

Latest News

 
పోలీసులను చూడగానే కలవరం.. ఫాలో అయితే వామ్మో.. అడవిలోనే దుకాణం పెట్టేశాడు Thu, May 02, 2024, 08:38 PM
లాస్ట్ పేరానే దెబ్బేసిందా.. అందుకే ఇన్ని తలనొప్పులా Thu, May 02, 2024, 08:33 PM
ఎగ్గొట్టడం బాబుకి అలవాటే Thu, May 02, 2024, 08:26 PM
ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై విషప్రచారం ఎందుకు బాబు? Thu, May 02, 2024, 08:26 PM
వైసీపీ మేనిఫెస్టో బ్రహ్మాండం Thu, May 02, 2024, 08:25 PM