by సూర్య | Mon, Jan 11, 2021, 12:47 PM
పీకలదాకా మందుకొట్టిన మందుబాబులు రెచ్చిపోయారు. ఓ రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది.నాగపూర్ నగరంలో ఆదివారం రాత్రి శంకర్ టేడే(29), సాగర్ పటేల్ (19) లు పీకల దాకా మద్యం తాగి బెల్టరోడి ప్రాంతంలోని దాబాకు వచ్చారు. తమకు చికెన్ వడ్డించమని మందుబాబులు కోరాడు. అయితే అందుకు దాబా యజమాని నిరాకరించాడు.దీంతో కోపంతో మందుబాబులిద్దరూ దాబాకు నిప్పంటించి పారిపోయారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
Latest News